అమానుషం.. నిద్రిస్తున్న కుమార్తెను కిరాతకంగా హతమార్చిన తల్లిదండ్రులు

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిని తల్లిదండ్రులే హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, గుళ్ల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు కుమార్తె నిద్రిస్తుండగా హత్య చేశారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య-ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక(25) గత ఏడు సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది.  కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో వివాహం చేశారు. వారు కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఉంటున్నారు. వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు. నెల రోజులుగా ప్రియాంక మునుపటి లాగే మానసిక వ్యాధితో బాధపడుతూ అందరిని ఇబ్బంది పెడుతోంది.

ఆమె ప్రవర్తనను చూసి విసిగిపోయిన తల్లిదండ్రులు ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హత్య చేశారు. 15న అత్తగారి గ్రామం దర్గాపల్లికి తీసుకెళ్లి చేతబడి వల్ల మరణించిందని చెప్పి నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు విచారణ చేయగా తల్లిదండ్రులు తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ఆ దంపతులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news