పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణలో పరిపాలన : కేటీఆర్

-

పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో పరిపాలన మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన రాష్ట్ర చిహ్నం మార్పుపై ఘాటుగా స్పందించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనా అని ప్రశ్నించారు.

రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి ‘గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’ అని పాడుకోవాలి !!?? ‘కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప’ అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి !!?? అని తెలిపారు. అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్త్రగీతంలో ఏమున్నదో తెలుసా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news