ఏపీ ఫలితాలపై హైదరాబాద్లో చర్చలు, బెట్టింగులు

-

నమస్తే అన్నా.. రేపే ఎలక్షన్ రిజల్ట్స్ కదా..? అవునే ఏపీలో ఎవరు గెలుస్తరంటవ్? ఈసారి బాబు వస్తారంటావా? లేదా మళ్లీ జగన్ మామే వస్తరా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ముఖ్యంగా హైదరాబాద్లో ఏపీ రాజకీయాలపై ఏ మూల చూసిన చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు ఒక చోట కలిసినా ఆంధ్రాలో అధికారం ఎవరనే దానిపై చర్చ వస్తోంది. మరో 24 గంటల్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది.

ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఏపీ ఫలితాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం కప్పు కాఫీతో మొదలైన చర్చలు.. రాత్రి భోజనాలు ముగిసి నిద్రపోయేవరకూ కొనసాగుతున్నాయి. ఇక కూటమి గెలుస్తుందని ఎంత ధీమాగా చెబుతున్నారో.. మరి కొంతమంది వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని కూడా అంతే గట్టిగా చెబుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా సర్వే సంస్థలు రకరకాల లెక్కలు చెబుతుండడంతో ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దీంతో దేనిపై బెట్టింగు పెట్టాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. అయితే కొందరు కూటమి విజయంపై ధీమాతో దానిపై బెట్టింగ్ చేస్తుండగా.. మరోవైపు మళ్లీ జగనే వస్తారంటూ వైసీపీపై భారీగా పందేలు కాస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news