ఉదయం 10:30 నుంచి గెలుపు సంబరాలకు సిద్ధం అవ్వండి – సజ్జల

-

ఉదయం 10:30 నుంచి గెలుపు సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 10:30 నుంచి గెలుపు సంబరాలకు సిద్ధం అవ్వండి అని వైకాపా శ్రేణులకు పిలుపు ఇచ్చారు సజ్జల. పోస్టల్ బ్యాలెట్స్ పై పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదని వివరించారు సజ్జల.

ఎన్నికల కౌంటింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం పై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేశారు.  కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ ఇచ్చేంత వరకు ఎవ్వరూ బయటికి రావద్దని సూచించారు. దేశంలో లేని నిబంధనలు ఏపీలోనే ఉన్నాయని తెలిపారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధన పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news