తెలంగాణలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాము : జూపల్లి కృష్ణారావు

-

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.టూరిజం ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని ఆయన తెలిపారు.

ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. బౌద్ధ టూరిజం సర్క్యూట్‌లో తెలంగాణలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. భారతదేశానికి, ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నాగార్జున సాగర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news