ప్రజా తీర్పును శిరసా వహిస్తాం : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

-

చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో కష్టపడి ప్రజలకు సేవలు అందించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు.  గత ఐదేళ్లు అభివృద్ధిలో 980 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ది పనులు చేశాం. మా శక్తి వంచన నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశాం. గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రజా తీర్పును శిరసా వహిస్తాం. మా పార్టీ కార్యకర్తలు అందరికీ అండగా ఉంటాను. లక్ష ఓట్లు వేసిన మా నియోజకవర్గం ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు.

చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఎన్నికైన పులివర్తి నాని కు శుభాకాంక్షలు తెలిపారు. మేము గెలుపు, ఓటమి వచ్చినా ఒకేలా ఉన్నామన్నారు. ప్రజలకు అండగా నిలుస్తాను, వచ్చే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో గెలుస్తాం. చిన్న వయసులో తుడా ఛైర్మన్ ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వం కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news