జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జనగామ జిల్లాలో కుక్కల దాడి జరిగి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం, ఫతేపూర్ శివారు నునావత్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో కనిపించలేదు ఆ 6 ఏళ్ల బాలుడు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Pet-dog-that-chewed-the-baby.webp)
కుక్కల అరుపులు వినిపిస్తుండడంతో.. చెట్ల పొదల్లో చూస్తే కుక్కల దాడితో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు కుటుంబ సభ్యులు. కుక్కల దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందడంతో ఒక్కసారిగా తండాలో అలుముకున్నాయి విషాద ఛాయలు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.