వార్-2లో ఎన్టీఆర్‌కు జతగా ఆలియా భట్

-

గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు పాన్ ఇండియా చిత్రం దేవరతో బిజీగా ఉన్న తారక్ మరోవైపు తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్-2తో కూడా బిజీగా ఉన్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో తారక్‌ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జ‌రుగుతోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదేంటంటే?

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కథానాయికగా న‌టించ‌బోతున్న‌ట్లు సమాచారం. జులై చివరి వారంలో అలియా భట్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనుందని టాక్. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో అలియా ఈ మూవీ ఒప్పుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news