టీటీడీ ఈవో ధర్మారెడ్డిని సెలవులో పంపిన ప్రభుత్వం

-

తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌ఛార్జ్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం సెలవులో పంపింది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డిని మంగళవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు సాధారణ సెలవులపై పంపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన తిరుపతి దాటి వెళ్లేందుకు అనుమతించినా, రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కీలక నేతలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు సాగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news