ఈనెల 12న కుటుంబ సమేతంగా తిరుమలకు చంద్రబాబు

-

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో వీఐపీల రాకపోకలకు అనువుగా ఉండేలా కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీప కేసరపల్లిలో ఎన్‌హెచ్‌-16 పక్కనే ఐటీ పార్కు ప్రాంగణం వద్ద ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మరోవైపు ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తిరుమలకు వెళ్లనుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news