యాదాద్రి జిల్లాలో మూడు రోజులుగా ఆగిన అంత్యక్రియలు..!

-

ప్రస్తుతం సమాజం రోజు రోజుకు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదో ఒక కారణంతో క్షణికావేశంలో తమ నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. తమ బంధవులతోనే, భార్యతోనే మరే ఇతర కారణాలతోనే క్షణం ఆలోచించకుండా ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ఓ వింత  ఘటన చోటు చేసుకుంది.

మూడు రోజుల క్రితం ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు హనుమంత రెడ్డి. అయినప్పటికీ  అంత్యక్రియలు ఆగిపోయాయి. ఇప్పటివరకు మార్చురీలోనే మృతదేహం ఉంది. అతనీ సోదరుడు, చెల్లెలు తో కోర్టులో ఆస్తి వివాదం నెలకొంది. దీంతో  ఆ కేసును విరమించుకుంటేనే అంత్యక్రియలు చేస్తానని  పేర్కొంది మృతుడు హనుమంతరెడ్డి భార్య. మూడు రోజులుగా ఆగాయి అంత్యక్రియలు.

Read more RELATED
Recommended to you

Latest news