అయోధ్యలో మాదిరిగానే గుజరాత్‌లో బీజేపీని ఓడిస్తాం : రాహుల్‌ గాంధీ

-

అయోధ్యలో మాదిరిగానే గుజరాత్‌లో కూడా బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోడీ అన్నారని, అలాంటప్పుడు అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌ గాంధీ శనివారం గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో మాదిరిగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ లోక్‌సభలో హిందుత్వపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువజన విభాగం సభ్యులు జూలై 2న అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణను రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. “మమ్మల్ని బెదిరించి, మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ద్వారా వాళ్లు (బీజేపీ) సవాల్ విసిరారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లుగా మేమంతా కలిసి వారి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నాం. రాత పూర్వకంగా తీసుకోండి. అయోధ్యలో చేసినట్లే గుజరాత్‌లోనూ నరేంద్ర మోదీని, బీజేపీని ఓడిస్తాం” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news