నా ప్రాణం ఉన్నంత వరకు వారికి అండగా ఉంటా – నారాయణ స్వామి

-

Former Deputy CM Narayanaswamy: నా ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకటించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమేలవేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. అనంతరం మాట్లాడారు. నా ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటా..లీడర్లకు ఏదైనా జరిగిన మనమంతా గట్టిగా ఉండాలా అని పేర్కొన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

Former Deputy CM Narayanaswamy

మనకు మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది… నేను చచ్చేంత వరకు మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తానని ప్రకటించారు. నేను ఎప్పుడు కూడా భయపడలేదన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేశారని పుల్లూరులో గతంలో నాలుగు ఇండ్లు ధ్వంసం చేశారని ఆగ్రహించారు. ఎవరైనా మనల్ని తిట్టిన కొట్టిన మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టినా మనకు న్యాయం జరగదని తెలిపారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మీకేం జరిగిందని వస్తా నా ప్రాణం ఉన్నంతవరకు మీకోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

Read more RELATED
Recommended to you

Latest news