ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థుల మృతి: కేంద్రం

-

ఉన్నత విద్య కోసం కొంతమంది, ఉన్నతమైన ఉద్యోగం కోసం ఇంకొంత మంది, బంగారు భవిష్యత్ కోసం మరికొంత మంది.. ఇలా ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అలాగే విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు అకాల మరణాలతో మృత్యువాత పడుతున్న ఘటనలూ రోజురోజుకు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం.. ఇలా పలు కారణాలతో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేకమంది భారతీయ విద్యార్థులు అక్కడే ప్రాణాలు విడిచారు.

గత ఐదేళ్లలో ఇప్పటివరకు 633 మంది విద్యార్థులు విదేశాల్లో మరణించారని కేంద్రం వెల్లడించింది. గత ఐదేళ్లలో మొత్తం 633 మంది ప్రాణాలు కోల్పోగా అత్యధికంగా కెనడాలో 172 మంది మృతి చెందినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ రాజ్యసభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. యూకేలో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్‌లో ఒకరు చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news