మదనపల్లె కు చేరుకున్న మాజీ MLA నవాజ్ బాషా..!

-

మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసు రసవత్తరంగా మారుతుంది. మాజీ MLA నవాజ్ బాషా బెంగళూరు నుండి మదనపల్లె కు చేరుకున్నారు. నవాజ్ ఇంటిలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ MLA నవాజ్ బాషా ను విచారణ కోసం DSP ఆఫిస్ కు తరలించనున్నారు అధికారులు. అయితే ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి,అక్కులప్ప ను విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేసారు పోలీసులు.

నవాజ్ బాషా బెంగళూరు నుండి మదనపల్లెకు చేరుకోవడంతో.. మాజీ MLA ఇంటికి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి సోదాలో పలు కీలక డాక్యూ మెంట్లు, కంప్యూటర్లు ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే మదనపల్లి ఫైల్స్ దగ్దము కేసులో హైదరాబాదులో కూడా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో సోదాలు చేసారు పోలీసులు. ఈ సోదాల్లో పదిమంది పోలీసులు పాల్గొనగా.. శశికాంత్ ఇంట్లో భారీగా ఫైల్స్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news