నేను ఎంత ఎత్తుకు ఎదిగినా నల్లమల్ల బిడ్డనే : సీఎం రేవంత్ రెడ్డి

-

కల్వకుర్తి ప్రాంతాన్ని ఎప్పటికీ మరిచిపోనని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుర్తి కొట్ర తండా చౌరస్తాలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ  సందర్భంగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా నల్లమల్ల బిడ్డనేనని పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జైపాల్ రెడ్డి చాలా కృషి చేశారు. 

జైపాల్ రెడ్డికి పదవీతో గౌరవం రాలేదు. ఆయనతోనే ఆ పదవీకి గౌరవం వచ్చింది. జైపాల్ రెడ్డి తను నమ్మిన సిద్దాంతాన్ని వదిలిపెట్టలేదు. ఓడినా, గెలిచినా పార్టీని మాత్రం వీడలేదు. చాలా మంది గర్వంగా జై పాల్ రెడ్డి గారి అనుచరులం, శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం చూశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని చాలా మంది తనను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. అందుకే ప్రజలు పట్టం కట్టలేదన్నారు. అదే జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. కచ్చితంగా 2014లో అధికారంలోకి వచ్చేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news