ఏపీలోని పేదలకు చంద్రబాబు శుభవార్త..వారందరికీ 3 సెంట్ల స్థలం !

-

Chandrababu’s good news for the poor in AP: ఆంధ్రప్రదేశ్లోని నిరుపేదలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. నిరుపేదలకు మూడు సెంట్లు భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. గృహనిర్మాణ శాఖ పై సోమవారం రోజున చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా… ఇళ్ల స్థలాల పంపిణీలో శుభవార్త చెప్పారు చంద్రబాబు నాయుడు.

Chandrababu’s good news for the poor in AP

ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే మూడు సెంట్ల భూమి ఇస్తామని ప్రకటించారు. అదే సమయంలో పట్టణాలలో అయితే రెండు సెంట్లు భూమి ఇస్తామని కూడా తెలిపారు. కొత్త లబ్ధిదారులకు విధానాన్ని అప్లై చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు గత వైసిపి ప్రభుత్వం ఇళ్ల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేసిందని విమర్శలు చేశారు. లేఅవుట్లు వేయని చోట ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నట్లు… ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news