మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొంగలు..!

-

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు అని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మదనపల్లి పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టిన రామకృష్ణ.. రెవిన్యూ దొంగలను శిక్షించాలి అని కోరారు. పేదల భూములను బలవంతంగా కబ్జా చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాడాలి. అసెంబ్లీకి వెళ్లి అధికార పక్షం చేసే తప్పులను ఎండగట్టాలి అని తెలిపారు.

జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడాన్ని తప్పుపడుతున్నాం అని అన్నారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయాల్సిందే. రాష్ట్రంలో కృష్ణ, తుంగభద్ర, గోదావరి నదులకు వరదలు వస్తున్నాయి. కానీ రాయలసీమలో వర్షాలు కురవక కరువు తాండవిస్తోంది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా అనంతపూర్, చిత్తూరు జిల్లాలకు సరఫరా చేయాలి అని పేర్కొన రామకృష్ణ.. సీఎం చంద్రబాబు కరువు జిల్లాలో పర్యటించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news