శ్రీశైలం వద్ద కృష్ణానదికి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబునాయుడు.

-

శ్రీశైలం లోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నేరుగా  శ్రీశైలం వద్ద ఉన్న కృష్ణానదికి సీఎం చంద్రబాబునాయుడు చేరుకొని జలహారతి ఇచ్చాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయల సీమలో కరువు లేకుండా సంకల్పం చేస్తున్నామని తెలిపారు. ఒక్క పక్క అభివృద్ది మరోపక్క సంక్షేమం, ఇంకోవైపు సంపద సృష్టించి దానిని పేదలకు పంచుతామన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచే మార్గాలను చూపిస్తామన్నారు. అదేవిధంగా  కృష్ణానది పై మరో బ్రిడ్జీ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేస్తానని.. ఇందుకోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతానని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.  

Read more RELATED
Recommended to you

Latest news