ప్రజాభవన్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆవేదన..!

-

తెలంగాణ ప్రజాభవన్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022 లో కానిస్టేబుల్  నోటిఫికేషన్ వచ్చినప్పుడు సెలెక్ట్ అయ్యి మెడికల్ లో కూడా క్వాలిఫై అయ్యాము. డ్రెస్ కొలతలు కూడా తీసుకున్నారు.  కానీ రేపు ట్రైనింగ్ అనంగా ముందు రోజు మమల్ని ఆపేసారు.  కారణం ఏంటి అని అడిగితే మా మీద కేసులు ఉన్నాయని చెప్పారు. మా కేసులు కూడా క్లియర్ అయ్యాయి.

అయినా ఎందుకు ఆపేసారు అంటూ అప్పటి నుంచి సీఎం కోసం మినిస్టర్స్ కోసం తిరుగుతూనే ఉన్నాము.  మాకు ఎటువంటి సమాధానం లేదు. కనీసం వాళ్లని కలవనివ్వట్లేదు.. ప్రతి మంగళవారం, శుక్రవారం వస్తూనే ఉన్నాము. మాకు సీఎం అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మా సమస్యలను పరిష్కరించాలి. మాకు కానిస్టేబుల్ ఉద్యోగం లభించేలా చూడాలని కోరుతున్నాం. పేదల పొట్ట కొట్టని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కలవడం లేదో అర్థం కావడం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news