రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ ఫైర్‌..!

-

తనపై దాడులకు ఈడీ సిద్ధమవుతున్నదని, లోక్‌సభలో తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల నేపధ్యంలో విపక్షాలు ఆయనకు బాసటగా నిలిచాయి. తాము రాహుల్‌ వెన్నంటి నిలుస్తామని సంఘీభావం ప్రకటించాయి. అయితే రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ విరుచుకుపడ్డారు. రాహుల్‌ వ్యాఖ్యలు అర్ధరహితమని ఆమె పేర్కొన్నారు.

రాహుల్‌ గురించి ఏం చెప్పగలం..?  ఆయన అర్ధం పర్ధం లేని మాటలపై ఏం మాట్లాడతం. నాకైతే ఆయన ఏమన్నారో అర్దం కాలేదని కంగనా వ్యాఖ్యానించారు. దేశం గురించి రాహుల్ మాట్లాడిన మాటలు సరైనవి కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు తాము లాభపడేందుకు దేశాన్ని ముక్కలుగా విభజిస్తారని, వారి మనస్తత్వం అదేనని అనురాగ్‌ ఠాకూర్ చెప్పిన మాటలను కంగనా రనౌత్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ హయాం నుంచే ఇలా జరుగుతున్నదని ఆమె ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news