చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం – మార్గాని భరత్‌

-

చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం అంటూ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలజో వైఎస్ఆర్సిపి హయాంలో పరిహారం, రేషన్, అందించడంలో ముందుందని తెలిపారు. టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం వరదల్లో ఫోటోలు దిగడానికి మాత్రమే పర్యటించారని పేర్కొన్నారు.

marghani on chandrababu naidu

ఇంత వరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతా ల్లో జరగలేదన్నారు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు… ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నీటి మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి…లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడే చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వాలంటీర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానని చెప్పి వ్యవస్థనే నిర్మూలించారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news