థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ పాండ్ కు గండి.. స్పందించిన మంత్రి గొట్టిపాటి రవి

-

నెల్లూరు జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ పాండ్ కు గండి పడిన ఘటనపై స్పందించారు మంత్రి గొట్టిపాటి రవి. ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడారు మంత్రి గొట్టిపాటి రవి.  గండిపడిన ఏపీజెన్కో యాష్ పాండ్ పునరుద్ధణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.

రైతులకు ఎలాంటి నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గొట్టిపాటి. యాష్ పాండ్ కు గండిపడడం వల్ల ఇబ్బందులు పడ్డ బాధిత రైతులను తప్పకుండా ఆదుకుంటామని పేర్కొన్నారు. యాష్ పాండ్ కు గండి పడిన సంఘటనపై సమగ్ర విచారణకి ఆదేశించించారు మంత్రి గొట్టిపాటి. ఇందుకు కారణమైన  బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టి పాటి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news