ఇండ్లు కట్టుకునేవారికి చంద్రబాబు శుభవార్త..ఆర్థిక సాయం పెంపు !

-

ఇండ్లు కట్టుకునేవారికి చంద్రబాబు సర్కార్‌ శుభవార్త. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. తెనాలి నియోజకవర్గంలో పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం ఉద్దేశించిన లే అవుట్లను, అక్కడి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..అనంతరం మాట్లాడారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్ల, గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు.

సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని..లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల గడువు ఇస్తున్నామన్నారు. పనులు మొదలు పెట్టకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని…. కొంత మంది లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియదని చెప్పడంతో విస్తుపోయారు మంత్రి మనోహర్. లబ్ధిదారులకు వారి స్థలాలు తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్…గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలు వారం రోజుల్లో విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news