స్వాతంత్ర దినోత్సవం రోజున సీఎం బూతు పురాణం సిగ్గు చేటు..!

-

స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్ బూతు పురాణం అందుకోవడం సిగ్గు చేటు అని ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు. రుణ మాఫీ పూర్తి చేయనందుకు సీఎం రేవంత్ అమరుల స్థూపం దగ్గర ముక్కు నెలకు రాయాలి. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే రేవంత్ బూతులు మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను తిట్టక పోతే రేవంత్ కు పూట గడవడం లేదు. రేవంత్ ఎన్ని తిట్టినా హామీల పై బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుంది.

అలాగే రేవంత్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా హరీష్ రావు పై అసభ్య విమర్శలు చేశారు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దేవుళ్ళను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. సూటిగా చెప్పు 31 వేల కోట్ల రుణ మాఫీ చేసావా లేదా అని ప్రశ్నించారు. కేవలం 17 వేల కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్ల లో వేశావ్. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news