భౌతిక డాడులతో కాంగ్రెస్ ఏం సాధించలేదు..!

-

అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పై చేయి సాధించడంలో కేటీఆర్ ,హరీష్ రావుల పాత్ర ప్రముఖంగా ఉంది. అందుకే సీఎం, కాంగ్రెస్ నేతలు వారిద్దరిని కావాలని టార్గెట్ చేస్తున్నారు అని ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి అన్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పినా మహిళా మంత్రులు రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు. హరీష్ రావు లక్ష్యంగా ఆయన క్యాంపు కార్యాలయం పై దాడి చేయడం పిరికి పందల చర్య.. ఇలాంటి భౌతిక డాడులతో కాంగ్రెస్ ఏం సాధించలేదు అని తెలిపారు.

ఇక రైతు రుణ మాఫీ మేడి పండులా మారింది. క్షేత్ర స్థాయిలో రుణ మాఫీ కాలేదు అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. హరీష్ రావు ఒత్తిడి తో ఈ మాత్రం రుణ మాఫీ అయింది. అలాగే కూడా మహిళా కమిషన్ ద్రుష్టి పెట్టాల్సిన అంశాల పై ద్రుష్టి పెట్టడం లేదు. నియోజక వర్గాల్లో కూడా ప్రతిపక్షాలపై కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులు చేస్తున్నారు. మమ్మల్ని అవమానించిన సీఎంతో మంత్రులు మహిళా కమిషన్ సారీ చెప్పిస్తే బాగుంటుంది. ఆరు గ్యారంటీలు 13 హామీలపై ద్రుష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది అని ఎమ్మెల్యే సునీత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news