తిరుమల తరహాలో త్వరలో వేములవాడలో నిత్యాన్నదానం

-

వేములవాడ వెళ్లే రాజన్న భక్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. తిరుమల తరహాలోనే వేములవాడ లో కూడా నిత్య అన్నదానం పెడతామని ప్రకటన చేయడం జరిగింది.
తిరుమలలోని వెంగమాంబ నిత్య అన్నదాన కార్యక్రమం మాదిరి ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే కార్తీకమాసం వరకు నిత్యాన్నదానం వేములవాడలో పెడతామని కూడా వెల్లడించారు.

Record income for Vemulawada Rajanna

కాగా  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్బంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి.వేములవాడ లో 300 MTS గోదాం ప్రారంభించి… PACS ఆన్లైన్ సర్వీస్ డిజిటల్ సేవా కామన్ సర్వీస్ సెంటర్ ప్రారంభం చేశారు. అనంతరం ది కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ లి. వేములవాడ శాఖ నూతన భవనాన్ని ప్రారంభించి నూతన భవనంలో ది కరీంనగర్ సహకార బ్యాంక్ ఎటిఎం ను ప్రారంభించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news