BREAKING: ఇవాళ స్పీకర్ ను కలవనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం… రాజీనామా చేయబోతున్నారా ?

-

 

నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో… తనకు జరిగిన అవమానం మీద ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 9:30 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలవనున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దళిత ఎమ్మెల్యేల బృందం.

 

Congress MLA Vemula Veeresham is anarchist

ఈ సందర్భంగా ప్రోటోకాల్ వివాదం ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్నారు వీరేశం. ఇది ఇలా ఉండగా.. ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు ఘోర అవమానం ఎదురయింది. ఇటీవల భువనగిరి మంత్రుల మీటింగ్ సంధర్భంగా వేముల వీరేశంను గుర్తుపట్టని పోలీసులు… ఆయనకు అనుమతి నిరాకరించారు. దీంతో అక్కడే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అక్కడ నుంచి వెనక్కి కూడా వెళ్ళిపోయారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news