మాజీమంత్రి కాకానిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మాజీమంత్రి కాకాని పై టీడీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మాదరాజు గూడూరు, ధనలక్ష్మిపురం గ్రామాల్లో పేదల గృహ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ ఐదు సంవత్సరాలలో ఒక్కసారి అయినా విద్యుత్ ప్లాంట్ నిర్వాసితుల కోసం చేపట్టిన ఆర్అండ్ఆర్ ఇండ్లను పరిశీలించలేదని అన్నారు.

వారి హయాంలో డబ్బులు దండుకోవడం, మట్టి, ఇసుక అమ్ముకోవడం తప్ప మరొకటి చేయలేదని విమర్శించారు. వైసిపి హయాంలో దుర్మార్గపు పాలన చేశారని.. వైసిపి ప్రభుత్వం వల్ల కాంట్రాక్టర్లు వర్కులు చేయలేక వెళ్లిపోయారని అన్నారు. ఇళ్ల నిర్మాణం జరిగే దగ్గర ఇనుప రాడ్లు, తలుపులను దొంగలు దోచుకుపోయారని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ ది ఒకరకం దోపిడీ అయితే.. కాకాని గోవర్ధన్ రెడ్డిది మరొక రకం దోపిడీ అన్నారు. నిర్వాసితుల కోసం చేపట్టిన ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదో కాకాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇల్లన్నీ నాసిరకంగా ఉన్నాయని విజిలెన్స్ విచారణలో వెళ్లడైందన్నారు సోమిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news