పార్టీ నీ నమ్ముకున్న వారికి తప్పకుండా ఫలితం దక్కుతుంది : సీఎం రేవంత్ రెడ్డి

-

పార్టీ నీ నమ్ముకున్న వారికి తప్పకుండా ఫలితం దక్కుతుందని తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అధికారంగా తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ ని నియమిస్తూ.. నియామక ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశాడు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా ఎంపికైన శ్రీ బి.మహేష్ కుమార్ గౌడ్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.  నూతన బాధ్యతలో మీరు గొప్పగా రాణించాలని.. కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మూడేళ్ల క్రితం నాపై ఎంతో నమ్మకంతో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినాయకత్వానికి…సహకరించిన నాయకులకు…వీరోచితంగా పోరాడి…పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. తాను NSUI నుండి పార్టీ కోసం పని చేశా. పార్టీ కోసం పని చేసిన అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news