ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు..!

-

హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు పరిరక్షణ కోసం  శ్రీకారం చుట్టినటువంటి హైడ్రా తన దూకుడును కొనసాగిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే  ప్రముఖ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ తో పాటు పలు అక్రమ కట్టడాలను కూల్చేస్తూ వస్తోంది హైడ్రా.  తాజాగా మరో టాలీవుడ్ సీనియర్ నటుడు, వ్యాపారవేత్త  మురళి మోహన్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి సంస్థలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది.

ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి రంగలాల్ కుంట చెరువు ఎస్టీఎల్, ఇంకా బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలను తొలగించాలని జయభేరీ సంస్థకు  నోటీసులు జారీ చేసింది హైడ్రా. ఇక భగీరథ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు FTL బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను వేయడం పై పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్టు తెలిపారు హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news