ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ చేసేందుకు వైసీపీ పడవలు..స్పందించిన అమర్నాథ్

-

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ బోట్లు గేట్లను ఢీకొన్న ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోట్లు గేట్లను ఢీ కొనటానికి కారణమైన ఇద్దరినీ అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. ఈ కేసులో ఏ1 గా ఉన్న ఉషాద్రి, ఏ2 గా ఉన్న రామ్మోహన్ ఇద్దరు వైసీపీ నేతలంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసిన బెజవాడ పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

gudiwada amarnath rects on prakasham boats issue

అయితే.. ఈ ప్రచారంపై వైసీపీ పార్టీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ స్పందించారు. ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ చేసేందుకు వైసీపీ వాళ్లు పడవలు వదిలారని డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారని ఆగ్రహించారు. వరదల్లో ముఖ్యమంత్రి, మంత్రుల విన్యాసాలు చూడలేక పోతున్నామని ఆగ్రహించారు. మ్యాటర్ వీక్ కనుక పబ్లిసిటీ పీక్ లోకి తెచ్చారన్నారు. బోట్ల యజమానులకు వైసీపీ నేత రామ్మోహన్ తో సంబంధాలు ఉన్నట్టు వార్తలు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు మాజీ మంత్రి అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news