రేపే జమ్మూకాశ్మీర్‌లో తొలి దశ ఎన్నికలు

-

జమ్ము కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా బుధవారం రోజున తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విస్తృతంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. బహుళ అంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు కాశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బిర్డి సోమవారం ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.

జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇదే కావడం విశేషం. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 18, 25, అక్టోబర్ 1వ తేదీన 3 దశలలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news