ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం

-

ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. నిన్న దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్ కు చేరిన భారత్ ఇవాళ ఫైనల్ లో చైనాతో తలపడింది. చైనాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 1-0 గోల్స్  తేడాతో ఘన విజయం సాధించింది. ఇది భారత్ కి ఐదో టైటిల్ కావడం విశేషం. ఈ సీజన్ లో భారత్ అన్ని మ్యాచ్ లలో అజేయడం నిలవడం గమనార్హం.

చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో నాలుగో క్వార్టర్స్ లో భారత్ ఒక పాయింట్ సాధించింది. దీంతో వరుసగా ఐదోసారి విజేతగా నిలిచింది భారత్. చైనా సెమి ఫైనల్లో 2-0 తేడాతో షూటౌట్ ద్వారా పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్ లో దక్షిణ కొరియాను భారత్ 4-1 తేడాతో ఘోరంగా ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో చివరగా చైనాను ఓడించి రికార్డు నెలకొల్పింది. ఆతిథ్య జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా టైటిల్ ను గెలుచుకుంది భారత్.

Read more RELATED
Recommended to you

Latest news