గురుకుల నుంచి ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్.. దొరికిన ఆచూకీ!

-

రాష్ట్రంలోని దేవరకొండ మైనార్టీ పాఠశాల‌లో ముగ్గురు విద్యార్థులు మంగళవారం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే, ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎట్టకేలకు వారి ఆచూకీని బుధవారం అర్థరాత్రి కనిపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం ..మంగళవారం ఉదయం గురుకుల మైనార్టీ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు తౌఫిక్, అబ్దుల్ రహమాన్, ముజీబ్ కనిపించకుండా పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, స్పెషల్ టీం బృందాలను రంగంలోకి దింపి విద్యార్థుల ఆచూకీని కనిపెట్టారు.

బుధవారం అర్ధరాత్రి 12.30 నిమిషాలకు మాల్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు.అనంతరం వారిని దేవరకొండ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చామన్నారు.విద్యార్థుల ఆచూకీ కోసం శ్రమించిన దేవరకొండ సీఐ నరసింహులు, కొండమల్లేపల్లి సీఐ ధనంజయ, దేవరకొండ ఎస్సై అజ్మీరా రమేష్, నల్గొండ జిల్లా స్పెషల్ టీం బృందానికి, మీడియాకు విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news