వైసీపీ ఓ డైనోసార్‌ పార్టీ..అందులో ఎవరూ ఉండరు- ఆదినారాయణ రెడ్డి

-

YSRCP పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీదీ NDA ప్రభుత్వం లో 100 రోజుల్లో అన్నీ జరిగాయన్నారు. వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ పార్టీ…. ఎవరూ ఉండరని బాంబ్‌ పేల్చారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. దేవుడిని కూడా వైసీపీ వదిలిపెట్టలేదని ఆగ్రహించారు. టిటిడి ప్రసాదం పై ల్యాబ్ రిపోర్టులు వచ్చాయని తెలిపారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.

Sensational comments of MLA Adinarayana Reddy on YSRCP

వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి దోపిడీలకే టిటిడి పాలక మండలి ఉందన్నారు. ఇప్పుడు సైలెంట్ గా కూర్చున్నారని ఫైర్‌ అయ్యారు. గ్రామీణ ఉపాధికి 1500 కోట్లు ఇవ్వాలని అనుమతులు తీసుకున్నారని తెలిపారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. మోదీ 100 రోజుల పాలనలో PMAYC లో 3 లక్షల ఇళ్ళు రాబోతున్నాయని ప్రకటించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. వైసీపీ కి ఉన్న ఎంఎల్ఏ, ఎంపీ లు కూడా పోయే రోజులు వచ్చాయన్నారు. భారీ నిధులు మన రాష్ట్రానికి రోడ్ల కోసం వస్తున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news