అమెరికా, జపాన్ పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి..!

-

అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటనకు బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, అధికారుల బృందం. ఈనెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు పర్యటన కొనసాగనుంది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పో తోపాటు, ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాల సందర్శన, పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు డిప్యూటీ సీఎం. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనంతో పాటు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, అధికారుల బృందం శనివారం హైదరాబాదు నుంచి అమెరికాకు బయలుదేరింది.

ఈనెల 24, 25 తేదీల్లో అమెరికా దేశంలోని లాస్ వేగాస్ లో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్పో లో పాల్గొంటారు. అక్కడ వివిధ కంపెనీల సీఈఓ లు, ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.. తదుపరి హోవర్ డాం ను సందర్శిస్తారు. 26న లాస్ట్ ఏంజెల్స్ కు చేరుకుంటారు. 27న EDWARDS & SANBORN బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని పరిశీలిస్తారు. 28న పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం అవుతారు. 29న జపాన్ దేశంలోని టోక్యోకి చేరుకుంటారు. 30న స్థానిక దౌత్యవేత్త ఏర్పాటు చేసిన డిన్నర్ లో పాల్గొంటారు. పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా సమావేశం అవుతారు. యమన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శిస్తారు. అక్టోబర్ 2న తోషిబా, కవాసకిల ప్రధాన కార్యాలయాల సందర్శన తదుపరి ఒసాకా చేరుకుంటారు. అక్టోబర్ 3న పానాసోనిక్ ప్రధాన కార్యాలయం సందర్శన చేసి.. అక్టోబర్ 4న హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news