Tirumala Laddu: నేటి నుంచి 11 రోజులు పవన్ కళ్యాణ్ దీక్ష

-

Tirumala Laddu: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు సిద్ధం అయ్యారు. నేటి నుంచి 11 రోజులు జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం కానుంది. గత నాలుగు రోజుల నుంచి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల ఫ్యాట్ కలుపుతున్నారని అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

Janasena party chief and AP Deputy CM Pawan Kalyan Deeksha will start from today for 11 days

ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏడుకొండల శ్రీవారిని క్షమించాలని కోరుతున్నారు. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇలాంటి పనులకు పాల్పడతారన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్ట లేకపోతే హైందవ జాతికే కలంకమని పేర్కొన్నారు. పాప నివారణగా ఇవాళ ఉదయం నుంచి కాకానిలోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల దీక్ష చేపడతారని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news