నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!

-

Fatal road accident in joint Nellore district: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో.. ఏకంగా ముగ్గురు మరణించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టింది ఓ కారు.

Fatal road accident in joint Nellore district

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. గాయపడిన వారిని గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నెల్లూరు వనంతోపుకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news