తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ !

-

తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం లో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రేషన్‌ కార్డు దారులకు సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. పంటలు నష్ట పోయిన రైతులకు ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని వెల్లడించారు. ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుందని వివరించారు.

ration shop

మార్కెట్ ధరలు తగ్గిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని… మద్దులపల్లి మార్కెట్ కు 20 కోట్లు శంక్షన్ చేశామని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్ తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ లు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు జాతీయ రహదారులు తీసుకొచ్చే భాగ్యం నాకు దక్కిందని… ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వస్తుందని స్పష్టం చేశారు. ఖమ్మం ను అన్ని రకాలుగా తీర్చిదిద్దే బాధ్యత మాదన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

Read more RELATED
Recommended to you

Latest news