రైతులకు శుభవార్త.. ఆ రోజున పీఎం కిసాన్ నిధుల విడుదల

-

దేశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు అక్టోబర్ 5వ తేదీ నుంచి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను పీఎం కిసాన్ సమ్మాన్ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని కోరింది.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు రూ.2,000 చొప్పున, ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయాన్ని కేంద్రం అందజేస్తున్న విషయం తెలిసిందే.

ఏప్రిల్-జూలై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్- మార్చి నెలల్లో 3 వాయిదాల్లో పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. 16వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. 17వ విడత నిధులను జూన్ 18న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. యూపీలోని వారణాసిలో 9.26 కోట్ల మంది రైతులకు 17వ విడతగా రూ.21,000 కోట్లను ప్రధాని మోడీ అర్హుల ఖాతాల్లో జమచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news