జనగామలోని ఏబీవీ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజ‌న్‌.. 15 మంది విద్యార్థులు

-

జనగామ జిల్లాలో దారుణం జరిగింది. విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. ఏకంగా 15 మంది ఫుడ్ పాయిజన్ కు గురై ఆస్పత్రి పాలు కావడం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లాలోని ఏబీవీ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇందులో చదువుతున్న 15 మంది ఇంటర్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొనడం జరిగింది.

Food poisoning in ABV College Hostel, Jangaon

విద్యార్థులకు హాస్టల్ లో ఆర్ఎంపి వైద్యుడు తో రహస్యంగా కూడా చికిత్స అందించారట సిబ్బంది. అయితే నలుగురి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ పై కాలేజీ యజమాన్యం… మౌనం వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news