నెల్లికుదురులో కిరాతకం.. నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

-

మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి మల్లం యాకయ్య (60) ఏళ్లు రోడ్డుపై వెళ్తుండగా మల్లం రాజు అనే వ్యక్తి మంచం పట్టెతో దాడి చేశాడు.దీంతో బాధిత వ్యక్తి యాకయ్య అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న సీఐ జగదీష్ నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య సోమక్క, కుమారుడు రమేష్, కూతురు నాగలక్ష్మి ఉన్నారు. అయితే, యాకయ్య, మల్లం రాజు మధ్య భూమి పంచాయితీలు, పాత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news