మచిలీపట్నంలో పేర్ని నాని పాప ప్రక్షాళన పూజలు

-

మచిలీపట్నంలో మాజీ మంత్రి  పేర్ని నాని ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తిరుపతి దేవస్థానం లేదా ఆ ఏడుకొండలు లేదా పరమ పవిత్రమైన వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నీ దేశం మొత్తం తహతహలాడుతుంది. అలాంటి అలాంటి సన్నిది లో దొరికే పవిత్రమైన లడ్డు ప్రసాదం ను ఈ రోజు అపవిత్రం జరగకపోయినా మలినమైపోయింది అంటూ పలుమార్లు మారు మారు మారు అపవిత్రం జరిగిందని బొంకుతున్న పాలకులను చూస్తే ఈ రోజు జాలిపడే కన్నా భయపడాల్సి  ఉందన్నారు.

తెలియక అపచారం చేస్తే.. దేవుడు క్షమిస్తాడు.  కానీ అన్ని తెలిసి   ఒక పాలకుడు సాక్షాత్తూ దేశం లోనే విరాజిల్లుతున్న శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు పై తన రాజకీయ దురుద్దేశం తో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయంగా అంతమొందించడానికి లడ్డు ప్రసాదం పై  విషప్రచారం చేశాడు. భగవంతుడు పాపుల నోరు శుద్ధి చేసే క్రమంలో చంద్రబాబు నోరు శుద్ధి చేయడం ప్రారంభించాడు.

Read more RELATED
Recommended to you

Latest news