జగన్‌ తిరుమల పర్యటన రద్దుపై పోసాని సంచలన వ్యాఖ్యలు !

-

జగన్‌ తిరుమల పర్యటన రద్దుపై పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు హెల్త్ బాగాలేకున్నా కూడా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలపై స్పందిస్తున్నానని… చంద్రబాబు చేస్తున్న రాజకీయాలపై మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని బాబు అంటున్నారు..నాకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశాను అని బాబు చెప్తున్నాడని ఆగ్రహించారు.


ఢిల్లీకి వెళ్లి మోడీ.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను చూశామని… బాబు హిందూ ధర్మ పరిరక్షకుడు అంట అంటూ సెటైర్లు పేల్చారు. అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మందు అమ్మకాలు జరగడంలేదన్న వ్యక్తి.. ధర్మ పరిరక్షకుడా.! మత్తతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్న అని గతంలో మసీద్ లోనే చెప్పాడు.. మాట తప్పాడన్నారు. మోడీ అంటే కేడీ.. కేడీ అంటే మోడీ అని ఎంత ఘోరంగా బాబు తిట్టాడోనని గుర్తు చేశారు. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news