పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి

-

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆదివారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. పురుషోత్తం రెడ్డి మృతిపట్ల పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news