బావమరిదితో లీగల్ నోటీస్ పంపితే మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా..? : కేటీఆర్

-

బావమరిదితో లీగల్ నోటీసులు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ? రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. “బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్లోనే ఆయన బావమరిది  కంపెనీకి రూ. 1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజమని స్పష్టం చేశారు.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజమన్నారు. శోద అనే కంపెనీ గత రెండు ఏళ్లుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని తెలిపారు. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే.. అంటూ సెటైరు వేశారు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉందన్నారు. నీకు ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా.. నువ్వు దొరికావు. రాజీనామా తప్పదు” అని ట్వీట్ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news