ఏపీలో కూటమి ప్రభుత్వం అధర్మం పాలన నడిపిస్తుంది : గురుమూర్తి

-

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధర్మం పాలన నడిపిస్తున్నారు. అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు అని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. వైసిపి నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాధాకరం.అమరావతి రీజియన్ లో ఉన్న ఎస్సీల పట్ల కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు బాధాకరం.

మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ ను అక్రమంగా నిర్బంధించి జైల్లో ఉంచారు. నందిగామ సురేష్ కు న్యాయం చేయాలంటూ ఎస్సీ కమిషన్ కలిసాం. రాష్ట్రంలో ఎస్సీల పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న అణిచివేత వ్యవహారాలను ఎస్సీ కమిషన్ కు వివరించాం అని పేర్కొన్నారు. అలాగే మన సుప్రీంకోర్టులో జరిగిన విచారణ ప్రభుత్వానికి చెంపపెట్టు. చంద్రబాబు దేవుడు పై కూడా రాజకీయాలు చేస్తున్నారు. కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. వాడని కల్తీ నెయ్యిని వాడినట్లు చెప్పి గందరగోళం సృష్టించారు అని గురుమూర్తి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news