మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దోతిపైకి ఎక్కిన తొండ..!

-

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తొర్రూర్ లో ఇవాళ బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రైతు మహా ధర్నాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.  బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దోతిపైకి  తొండ ఎక్కింది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా.. స్టేజి పైకి ఒక్కసారిగా ఓ తొండ వచ్చింది.

అయితే భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరగగా..ఆ తొండకు భయపడతరా ? అంటూ తాటికొండ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిలుచొని మాట్లాడుతున్న రాజయ్య దోతీ పైకి ఎక్కి షర్ట్ లోపల నుండి ఛాతీ వరకు వెళ్లింది. రాజయ్య ఓ చేత్తో మైక్ ను పట్టుకొని.. మరో చేత్తో తొండను షర్టుతో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కండువా తో తొండను బంధించి పక్కన విసిరేశారు.

Read more RELATED
Recommended to you

Latest news