రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. సినీ ఫక్కీలో పోలీసుల వాహనాన్ని!

-

ఏపీలోని విశాఖలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఏకంగా సినిమాను తలపించేలా పోలీసులను పరుగులు పెట్టించారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మాదకద్రవ్యాలు,గంజాయి స్మగ్లింగ్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గంజాయి స్మగ్లర్లకు పోలీసులు నిద్రలేకుండా చేస్తున్నారు. అయితే, తాజాగా సినీ ఫక్కీలో మాదిరిగా స్మగ్లర్లకు,పోలీసులకు మధ్య భారీ ఛేజింగ్ జరిగింది. గంజాయి స్మగ్లర్లను ఎలాగైనా పట్టుకోవాలని నిందితుల కారును పోలీసులు ద్విచక్ర వాహనంపై ఛేజ్ చేశారు.

దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు తమ కారుతో ఏకంగా పోలీసుల బైక్‌ను ఢీకొట్టి పారిపోయారు.ఈ ఘటన శుక్రవారం విశాఖపట్నంలో చోటుచేసుకుంది.పోలీసుల వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం బీహెచ్‌ఈఎల్ షీలానగర్ వద్ద కారును వదిలి నిందితులు పరారయ్యారు. కారును సీజ్ చేసిన పోలీసులు అందులో లిక్విడ్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, వీరు గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారని ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news